వాటర్ హీటర్ షాక్ కొట్టి మహిళ మృతి

వాటర్ హీటర్ షాక్ కొట్టి మహిళ మృతి

మియాపూర్, వెలుగు: స్నానానికి వేడి నీళ్లు పెట్టుకున్న ఓ మహిళ హీటర్​ద్వారా కరెంట్​షాక్​తగిలి మృతిచెందింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వడలపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్ధిరాములు, శివలీల(40) దంపతులు మియాపూర్‏లోని మాధవ్​నగర్​కాలనీకి వలస వచ్చారు. సిద్ధిరాములు మేస్ర్తీ పనిచేస్తుండగా, స్థానికంగా ఉన్న ఓ అపార్ట్​మెంట్‎లో శివలీల వాచ్​ఉమెన్‎గా, ఫ్లాట్లలో ఇంటి పనులు చేస్తోంది. శనివారం ఉదయం పనికి వెళ్లిన శివలీల మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు బాత్రూంలో బకెట్‎లో వాటర్​ హీటర్​పెట్టింది. వేడయ్యాక తీసే క్రమంలో కరెంట్​షాక్​కొట్టి స్పాట్‎లో చనిపోయింది.