మియాపూర్, వెలుగు: స్నానానికి వేడి నీళ్లు పెట్టుకున్న ఓ మహిళ హీటర్ద్వారా కరెంట్షాక్తగిలి మృతిచెందింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వడలపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్ధిరాములు, శివలీల(40) దంపతులు మియాపూర్లోని మాధవ్నగర్కాలనీకి వలస వచ్చారు. సిద్ధిరాములు మేస్ర్తీ పనిచేస్తుండగా, స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో శివలీల వాచ్ఉమెన్గా, ఫ్లాట్లలో ఇంటి పనులు చేస్తోంది. శనివారం ఉదయం పనికి వెళ్లిన శివలీల మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు బాత్రూంలో బకెట్లో వాటర్ హీటర్పెట్టింది. వేడయ్యాక తీసే క్రమంలో కరెంట్షాక్కొట్టి స్పాట్లో చనిపోయింది.
