Box Office War: త్రివిక్రమ్ vs సీఎం విజయ్ కుమారుడు.. బాక్సాఫీస్‌ వార్లో గెలిచేది ఎవరు?

Box Office War: త్రివిక్రమ్ vs సీఎం విజయ్ కుమారుడు.. బాక్సాఫీస్‌ వార్లో గెలిచేది ఎవరు?

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘సిగ్మా’ (Sigma) ఒకటి. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్‌ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించగా, జీకేఎమ్‌ తమిళ్‌ కుమారన్‌ ఈ చిత్రానికి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.  

వాయిదాల పర్వం- కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!  

వాస్తవానికి ‘సిగ్మా’ సినిమాను జూలై 31న విడుదల చేయాలని మేకర్స్ మునుపు భావించారు. అయితే, ఆ తేదీకి సరిగ్గా వారం ముందు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ విడుదల కావడంతో, బాక్సాఫీస్ వద్ద క్లాష్ రాకుండా ఉండేందుకు ‘సిగ్మా’ చిత్రాన్ని వాయిదా వేశారు.   అప్పటి నుంచి సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న చిత్రబృందం తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. 

గాంధీ జయంతి స్పెషల్‌గా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. యాక్షన్, అడ్వెంచర్ మరియు హీస్ట్ థ్రిల్లర్ (Heist Thriller) నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.  

అక్టోబర్ 2న బాక్సాఫీస్ వార్: 

‘ఆదర్శ కుటుంబం’తో గట్టి పోటీ!  అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అదే రోజున (అక్టోబర్ 2న) టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్‌గా వస్తున్న త్రివిక్రమ్ - వెంకటేష్‌ల ‘ఆదర్శ కుటుంబం’ (House No: 47 - AK 47) సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూడా ఎస్. థమనే సంగీతం అందిస్తుండటం విశేషం.

►ALSO READ | Ram Charan : రవితేజ 'ఇరుముడి'లో రామ్ చరణ్ ఎంట్రీ? వైరల్ అవుతున్న వార్తపై క్లారిటీ!

మరి గాంధీ జయంతి బరిలో నిలుస్తున్న ఈ రెండు చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుంది? ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు జేసన్ సంజయ్ డెబ్యూ మూవీ ‘సిగ్మా’ యూత్, యాక్షన్ లవర్స్‌ను టార్గెట్ చేస్తుండగా, మరోవైపు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి.

హీరోగానూ ఎంట్రీ ఇవ్వనున్న జేసన్ సంజయ్!  

దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన జేసన్ సంజయ్ త్వరలోనే హీరోగానూ తెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత జీకేఎమ్‌ తమిళ్‌ కుమారన్‌ తన సొంత బ్యానర్‌పై జేసన్ సంజయ్‌ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక క్లారిటీ త్వరలోనే వెలువడనుంది.