హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. బైక్ పై వెళుతున్న కావ్య(23) అనే మహిళ ను ప్రయివేటు బస్సు(బస్ నంబర్ TS UA 5330) ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.