మహిళ ప్రాణం తీసిన నాటు మందులు

మహిళ ప్రాణం తీసిన నాటు మందులు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన

ఎల్లారెడ్డి పేట, వెలుగు: నాటు వైద్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎస్‌‌‌‌ఐ రమాకాంత్​తెలిపిన ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి లలిత(56) కొన్నేండ్లుగా షుగర్, హై బీపీతో బాధపడుతుంది. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో నాటు వైద్యులను సంప్రదించి, పసరు మందులు వాడుతుంది. శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత ఆమె మందులు వేసుకొని నిద్రపోయింది. 

కాసేపటికి హాల్ లోకి వచ్చిన ఆమె కొడుకు తల్లి నోట్లోంచి నురగలు రావడం చూసి వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ల సూచనతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. నాటు మందులు వేసుకోవడంతోనే తన తల్లి చనిపోయిందని కొడుకు కళ్యాణ్​ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.