మద్యం మత్తులో డ్రైవింగ్.. భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

మద్యం మత్తులో డ్రైవింగ్.. భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. గత శుక్రవారం రాత్రి  ఘాట్ కేసర్ పిఎస్ పరిధిలో హిట్ అండ్ రన్  కేస్ నమోదు అయ్యింది. నిఖిల్ రెడ్డి అనే ఇంజనీరింగ్ విద్యార్థి మద్యం సేవించి వేగంగా కారు నడిపాడు. వేగంగా వెళ్తూ.. బైక్ ను ఢీకొట్టాడు.  ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న భార్య , భర్తలు కింద పడ్డారు. భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఘటన స్థలం నుండి పారిపోయేందుకు నిఖిల్ రెడ్డి ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడ్నివెంబడించి పట్టుకున్నారు. అతనిపై 304(a) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిఖిల్ రెడ్డి పై మర్డర్ సెక్షన్ 304(2) కింద కేస్ నమోదు చేయాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ భర్త హనుమాన్ దాస్ ప్రస్తుతం సికింద్రాబాద్ శ్రీకర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో హనుమాన్ దాస్ తలకు బలమైన గాయాలు కావడంతో అతని ఆపరేషన్ కి 15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో తండ్రి చికిత్స కోసం అతని ఇద్దరు కుమారులు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని దాస్ కుమారులు కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండి:

కాలేజీలో కరోనా కలకలం

న్యూ ఇయర్ వేడుకలు.. ఒంటి గంట వరకు బార్లు ఓపెన్