శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పొలంలో పని చేస్తున్న మహిళలపై దాడి చేశాయి . ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని మండ పంచాయితీ ఈతమానుగూడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామంలోని జీడితోటలో పని చేస్తున్న సవర గైయ్యారమ్మ(62) అనే మహిళ పై ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ బోడమ్మ పై కూడా ఏనుగుల దాడి చేయడంతో తీవ్ర గాయాలై ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఆ గ్రామ ప్రజలు.