ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. 2023, అక్టోబర్ 19వ తేదీ బుధవారం కర్నాటక మంగళూరులోని లేడీహిల్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. కారును ఆపకుండా అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు.

ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.