మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్పరిధిలో ఓ యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఘట్కేసర్ మండలం ముత్వెల్లిగూడకు చెందిన రాజగోని మంజుల బిడ్డ సోని(19) రెండు నెలల క్రితం పెద్దఅంబర్పేటకు చెందిన విజయ్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెండ్లి ఇష్టం లేని యువతి అత్తింటి వారు దంపతులను ఇంటి నుంచి పంపించివేశారు. దీంతో ముత్వెల్లిగూడలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.
ప్రస్తుతం సోని గర్భవతి. కాగా, ఆదివారం ఉదయం ఆమెకు ఛాతినొప్పి వచ్చింది. దీంతో భర్త విజయ్ ఆమెను ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. బీపీ విపరీతంగా పెరగడంతో మెరుగైన వైద్యం కోసం ఓ కార్పొరేట్ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
