
వికారాబాద్, వెలుగు: మతిస్థిమితం లేని ఓ మహిళ రోడ్డుపై ప్రసవించిన సంఘటన వికారాబాద్ లో జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వికారాబాద్ జిల్లా హాస్పిటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలింతతో పాటు ఆడ శిశువును హాస్పిటల్ స్టాఫ్ ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు.
ప్రసవించిన మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆమెకు రెండు బాటిళ్ల రక్తం ఎక్కించామని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించినట్లు తెలిపారు.