కు.ని శిబిరంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ మృతి

కు.ని శిబిరంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ మృతి

నారాయణపేట జిల్లా: దామరగిద్దలో విషాదం జరిగింది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ శిబిరంలో వైద్యం వికటించి ఓ మహిళ సర్పంచ్ మృతి చెందారు. ఆపరేషన్ చేసిన కొద్ది సమయానికే ఆరోగ్యం విషమించడంతో ఆమెను మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు.అక్కడికి తరలించిన కొద్దిసేపటికే లింగారెడ్డి గ్రామ మహిళా సర్పంచ్ లక్ష్మి చికిత్స పొందుతూ చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మరణించిందని భర్త అశోక్ ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని వీరసావర్కర్ చౌరస్తాలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధర్నా చేశారు. ఇవాళ 145మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. తగినన్ని పడకలు లేకపోవడంతో చాలా మందిని నేలపైనే పడుకోబెట్టారు ఆస్పత్రి సిబ్బంది.