పెళ్లైందని పరిహారం ఇస్తలే : గౌరవెల్లి నిర్వాసితులు

పెళ్లైందని పరిహారం ఇస్తలే : గౌరవెల్లి నిర్వాసితులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గౌరవెల్లి భూ నిర్వాసిత మహిళలు ఆందోళనకు దిగారు. పెళ్లి అయిన యువకులతోపాటు తమకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో ముంపు గురైన మేజర్లకు ప్రభుత్వం 6 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించింది. అయితే పెళ్లి అయిందనే కారణంతో అమ్మాయిలకు పరిహారం చెల్లించడంలేదు. దీంతో కొన్ని రోజులుగా మహిళలు ఆందోళన బాట పట్టారు. ఈ  నేపథ్యంలో ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ క్యాంపు కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకున్న 50మంది మహిళలు క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే సమస్యను పరిష్కరిస్తామంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.