అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి : మంత్రి సీతక్క

అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి : మంత్రి సీతక్క
  •     కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్​ వృద్ధాశ్రమ ప్రారంభంలో మంత్రి సీతక్క 

జనగామ, వెలుగు :  అమ్మానాన్నలను   బాగా  చూసుకోవాలని,  చివరి రోజుల్లో వృద్ధులను సంతోషంగా ఉంచేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక పెద్దల(వృద్ధ) ఆశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్​, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.   జనగామ జిల్లా కేంద్రం శివారు సిద్ధిపేట రోడ్డు శామీర్​ పేట సమీపంలో   కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో   వృద్ధాశ్రమ  ఆమె ప్రారంభించారు. 

అనంతరం సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఫౌండేషన్​ చైర్​ పర్సన్​ కోమటిరెడ్డి లక్ష్మీ,  రాజగోపాల్​ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడారు. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలోనే ఒక మోడల్ గా కార్పొరేట్ కంపెనీ స్థాయిలో వృద్ధాప్య ఆశ్రమాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు.   కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ రామచంద్రు నాయక్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​, అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​ కుమార్​, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి పాల్గొన్నారు.