భర్తనే కావాలంది..నిప్పంటించిన ప్రియుడు

భర్తనే కావాలంది..నిప్పంటించిన ప్రియుడు

భర్త విలువ తెలుసుకుని ప్రియుడిని దూరం పెట్టింది.

భర్తతో ఉంటుందని..ప్రియురాలిని చంపిన ప్రియుడు

అక్రమసంబంధం ప్రాణాన్ని బలిగొంది. భర్తను కాదని..ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చివరకు ప్రియుడే చంపేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది . రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌ నగర్ మండలంలోని మహాల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు అనే యువకుడికి, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ చాలారోజులు శారీరకంగా కలుసుకుంటూ.. షికార్లు కొట్టారు. అయితే కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. గొడవ తర్వాత ప్రియుడికి దూరమైన ఆమె… భర్త ప్రేమకు దగ్గరైంది. తాను చేస్తున్న తప్పును తెలుసుకుని, రాములుతో మాట్లాడడం మానేసింది.  ఆమెతో శారీరక సుఖానికి బాగా అలవాటు పడిన రాములు… ఆమె వెంటపడి కోరిక తీర్చాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడు.

అయినా ఆమె పట్టించుకోకపోవడంతో..తనకు దగ్గనిది ఎవ్వరికీ దక్కకూడదని పక్కా ప్లాన్ వేశాడు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఆపి.. కోరిక తీర్చాలన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటలను తట్టుకోలేక మహిళ కేకలు వేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు… మంటలు ఆర్పి, హస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు. అయితే ఆమె ప్రాణాలు చికిత్స పొందుకు గురవారం కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాములు కోసం గాలిస్తున్నారు.