తాగిన మత్తులో యువతి హల్ చల్ ... జీడిమెట్ల పీఎస్ లో కేసు నమోదు

తాగిన మత్తులో యువతి హల్  చల్ ... జీడిమెట్ల పీఎస్  లో కేసు నమోదు
  •     రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను బూతులు తిడుతూ.. పోలీసులతోనూ 
  •     వాగ్వాదం  జీడిమెట్ల పీఎస్​లో కేసు నమోదు

జీడిమెట్ల, వెలుగు: మద్యం  మత్తులో హల్ చల్ ​చేస్తూ ప్రయాణికులను ఇబ్బందిపెట్టిన యువతిపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూరారం ప్రాంతానికి చెందిన రూప అలియాస్ ​ఇందు (24) సోమవారం అర్ధరాత్రి  షాపూర్​నగర్​ చౌరస్తాలో మద్యం తాగి హల్​చల్​ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడింది. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతోనూ సదరు యువతి వాగ్వాదానికి దిగింది. అనంతం ఆమెకు నచ్చచెప్పిన పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించారు.  అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.