పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పార్సీగుట్టకు వెళ్లే దారిలోని బాపూజీ నగర్ క్రాస్ రోడ్ కొత్త వైన్ షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు ఆదివారం ధర్నా నిర్వహించారు. వీరికి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పిల్లలు, మహిళలు తరచూ రాకపోకలు చేసే ఈ ప్రాంతంలో వైన్షాపునకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
