ఇవ్వాల్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లు.. గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం

ఇవ్వాల్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లు.. గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం
  • ఇవ్వాల్టి నుంచి జీరో టికెట్లు
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 

హైదరాబాద్, వెలుగు : ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ - పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మెషీన్ల ద్వా రా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేయనుందని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని, స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించాలని సూచించారు. ఈ పథకాన్ని  మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని కోరారు.