మహిళా బిల్లు పెట్టాలి.. జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్

మహిళా బిల్లు పెట్టాలి..  జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్

ముషీరాబాద్/బషీర్ బాగ్, వెలుగు:పార్లమెంటులో బీసీ బిల్లుతోపాటు మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు న్యాయం చేయాలని జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్ చేసింది. అశ్లీల దృశ్యాలను నిషే ధించి, మహిళలపై అకృత్యాలు, గృహహింసను అరికట్టాలని కోరింది. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ బీసీ మహిళా సంఘం కోర్ కమి టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పద్మలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టి బీసీ మహిళలకు సబ్ కోట కల్పించినప్పు డే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. 

ఇప్పటికే మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని లోక్​సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని ఆయన కోరారు. మహిళలపై అకృత్యాలు, హత్యలకు సినిమాలో అసభ్యకర అంశాలు, అశ్లీల దృశ్యాలు కారణమవుతున్నాయని.. అలాంటి వాటి ని నిషేధించాలని పద్మలత కోరారు. మహిళల కోసం 19 చట్టాలు ఉన్నప్పటికీ అత్యాచారాలు, గృహహింస తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలన్నారు. తర్వాత పార్లమెంటులో బీసీ బిల్లు, మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 24, 25న చేపట్టనున్న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. 

21న చలో ఢిల్లీని సక్సెస్ చేయాలి 

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలె, జనాభా లెక్కంపులో కులాలవారీగా ఎంత మంది ఉన్నారనేది కూడా లెక్కించాలె, కేంద్ర బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలె, ఒక్కొక్క బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని ప్రకటించాలె” అని అన్నారు. డిమాండ్ల సాధన కోసం జులై 21న చేపట్టిన చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలి పిలుపునిచ్చారు.