వచ్చే ఏడాది మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్లో జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి-మార్చి 2021లో జరగాల్సిన ఈ సిరీస్ కరోనా కారణంగా 2022కి వాయిదాపడింది. ఎనిమిది దేశాలు ఈ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఈ సిరీస్లో మొత్తం 31 మ్యాచులు 31 రోజుల పాటు జరగనున్నాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్, హామిల్టన్, తరంగా, వెల్లింగ్టన్, క్రిస్టిన్ చర్చ్, డునెడిన్ సిటీలు ఈ మ్యాచులకు వేదికలుగా నిలవనున్నాయి. ఇండియా టీం తన తొలి మ్యాచ్ను మార్చి 6న క్వాలిఫయర్ టీంతో ఆడనుంది.
For More News..