నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఐటీ కంపెనీలు
హైదరాబాద్, వెలుగు: సిటీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఐటీ కంపెనీల్లో డైలమా కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో ఆఫీసులు ఓపెన్ చేస్తారని భావించినా, నెలాఖరుదాకా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిటీలో దాదాపు 6 లక్షల మంది టెకీలు ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా కంపెలన్నీ స్టాఫ్తో వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపున్నా ఆఫీసులు ఓపెన్ చేయడం లేదు.
ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్
ఐటీ కంపెనీల్లో 40 శాతం స్టాఫ్కు మాత్రమే వెహికల్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. 20శాతం మంది ఓన్ వెహికల్స్లో, మిగిలిన వాళ్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా డ్యూటీకి వెళ్లేవారు. సిటీలో ఇంకా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ స్టార్ట్ కాలేదు. అందరికీ ట్రాన్స్ఫోర్ట్ ఫెసిలిటీ కల్పించాలంటే కంపెనీకి భారమవుతుందని మాదాపూర్లోని ఓ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ ప్రసూన పేర్కొన్నారు. హైటెక్ సిటీలోని ఓ కంపెనీ ఈ నెల 1 నుంచి ఆఫీసుకు అటెండ్ కావాలని స్టాఫ్కు గత నెల 25న ఇన్ఫర్మేష న్ ఇచ్చింది. తాజా కేసులను చూసి మరో 15 రోజులు వర్క్ ఫ్రం హోమ్ పొడిగి స్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ల ద్వారా మెసేజ్ పంపించింది. ఇక ఎంఎన్సీలైతే ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన పని లేదని, మరో నెలపాటు వర్క్ ఫ్రం హోమ్నే ఉంటుందని నిర్ణయం తీసుకున్నాయి.
For More News..