నిద్రమత్తులో బిల్డింగ్ పైనుంచి పడి కార్మికుడి మృతి

నిద్రమత్తులో బిల్డింగ్ పైనుంచి పడి కార్మికుడి మృతి

జీడిమెట్ల, వెలుగు: బిల్డింగ్​పైనుంచి కింద పడి ఓ కార్మికుడు చనిపోయిన ఘటన పేట్​బషీరాబాద్​ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లికి చెందిన శ్రీను(41) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మేస్త్రీ గోవిందరెడ్డితో కలిసి కొంపల్లిలో సెంట్రల్ పార్కు స్ట్రీట్​లో ఓ పాత బిల్డింగ్​కు రిపేర్లు చేశాడు. రాత్రి ఇద్దరూ భోజనం చేసి అదే బిల్డింగ్​పై పడుకున్నారు. అర్ధరాత్రి శ్రీను వాష్​రూమ్​కు వెళ్లేందుకు లేచాడు. నిద్రమత్తులో బిల్డింగ్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.