పద్మారావునగర్, వెలుగు: మోకాలి, నడుము నొప్పి నివారణకు సరికొత్త వైద్య విధానాలపై రాష్ట్రంలోని డాక్టర్లకు గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించారు. ఆదివారం జరిగిన వర్క్షాప్లో రాష్ర్టంలోని పలు జిల్లాలతో పాటు సిటీ నుంచి వచ్చిన దాదాపు 150 మంది పెయిన్ ఫిజిషీయన్స్, అనస్తీషియా వైద్యులు హాజరయ్యారు. గాంధీ పూర్వ విద్యార్థి అమెరికాలో స్థిరపడిన డాక్టర్రామ్ పసుపులేటి సహకారంతో గాంధీ అనస్తీషియా విభాగం ఆధ్వర్యంలో నూతన వైద్య విధానాలు వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామ్ పసుపులేటి మాట్లాడుతూ.. ఇండియాలో ఇటీవల కాలంలో మోకాలి, నడుము నొప్పులు బాగా పెరిగిపోయాయన్నారు. గాంధీలో 2017లో ప్రారంభమైన పెయిన్ క్లినిక్కు సరైన వైద్య పరికరాలను ఇప్పటికే డోనేట్ చేశామన్నారు. గాంధీ అనస్తీషియా ప్రొఫెసర్ డా.పి.శ్రీదేవి మాట్లాడుతూ.. గాంధీలో ఉచితంగా ట్రీట్ మెంట్ ఇవ్వడానికి డా.రామ్ పసుపులేటి కృషితో పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ డా.హెచ్. ఎల్. బేబిరాణి, సెక్రటరీ డా.పి.శ్రీదేవి, ట్రెజరర్ డా.జి.నాగరాజ్ గౌడ్, మెంబర్స్ డా.అబ్బయ్య, డా.జుబేర్, డా. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.