
ఇంట్లోనే పెండ్లి.. 20 మందే గెస్టులు
థానే: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్రలోని థానేలో ఓ జంట కొద్ది మంది దగ్గరివాళ్లు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. మాస్కులు పెట్టుకుని మరీ పెండ్లి చేసుకున్నారు. వేడుకకు వచ్చినవారు మాస్కులు పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ను పాటించారు. లాయర్ రూపేశ్ జాధవ్, ఐటీ ఉద్యోగి ప్రియాంకకు ఆదివారం మ్యారేజ్ జరగాల్సి ఉంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ముందుగానే పెండ్లి చేసుకున్నారు. “ఈ నెల 22న పెండ్లి చేసుకోవాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. హాల్ కూడ బుక్ చేశాం. పెండ్లి పత్రికలు పంచాం. కరోనా వైరస్ కారణంగా ఫంక్షన్ హాల్లో పెండ్లి వాయిదా వేసుకున్నాం. ఇంట్లోనే 20 మంది అతిథుల సమక్షంలో పెండ్లి చేసుకున్నాం” అని వరుడు రూపేశ్ అన్నారు.
For More News..