చిన్నతాండ్రపాడు గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

చిన్నతాండ్రపాడు గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

అయిజ, వెలుగు: మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో జరుగుతున్న సత్యమాంబ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలను పీఏసీఎస్​ మాజీ చైర్మన్  సంకాపూర్  రాముడు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు 23 మంది మహిళా పహిల్వాన్లు, 32 మంది పురుష పహిల్వాన్లతో కలిపి 54 మంది పాల్గొన్నారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి క్రీడాభిమానులు తరలివచ్చారు.