యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి 21 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. 21 రోజులకు మొత్తం హుండీ ఆదాయం కోటి 64 లక్షల 34 వేల 500 రూపాయలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బంగారం, 86 గ్రామలులు, 2కిలోల 750 గ్రాముల వెండిని భక్తులు కానుకగా వేసినట్లు తెలిపారు.
ఇక విదేశీ కరెన్సీని భక్తులు హుండీలో భారీగా సమర్పించుకున్నారు. అమెరికా 2,368 డాలర్లు, యూఏఈ 35 దిరామ్స్, ఆస్ట్రేలియా 25 డాలర్లు, కెనడా 20 డాలర్లు, కతార్ 13, యూరోప్ 30,కువైట్ 11,మలేసియా 1, విటినుం 70,000, ఇంగ్లాండ్ 20, సింగపూర్ 2, భూటాన్ 3,నేపాల్ 100, ఫ్రాన్స్ 20, ఈస్ట్ ఆఫ్రికా 100 కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.