
తన జీవిత చరిత్ర రాసే బాధ్యత యండమూరి వీరేద్రనాథ్దే అన్నారు చిరంజీవి. శనివారం విశాఖపట్నంలో జరిగిన లోక్ నాయక్ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘నాకు మెగాస్టార్గా బిరుదు రావడానికి కారణం యండమూరి గారి నవలలే. అభిలాష, ఛాలెంజ్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు ఆయన రచనల నుంచి వచ్చినవే. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం చాలా సంతోషంగా ఉంది. నాకు గురు సమానులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది.
తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లుగా భావించే వారితో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం. వాళ్లిద్దరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.