ENG vs IND 2025: ఇండియన్ ఫీల్డర్ సర్‌ప్రైజ్.. ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో లేకపోయినా ఫీల్డర్‌గా గ్రౌండ్‌లోకి

ENG vs IND 2025: ఇండియన్ ఫీల్డర్ సర్‌ప్రైజ్.. ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో లేకపోయినా ఫీల్డర్‌గా గ్రౌండ్‌లోకి

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 23) మూడో రోజు ఆటలో భాగంగా యార్క్‌షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా ఇంగ్లాండ్ స్క్వాడ్ లో సెలక్ట్ కాకపోయినా గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత జట్టు ఏడో ఓవర్లో వికెట్ నష్టానికి 22 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వగాడియా ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు.  

యార్క్‌షైర్ 2వ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్న 21 ఏళ్ల యువ ఆల్ రౌండర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్థానంలో తాత్కాలిక ఫీల్డర్ గా జట్టులోకి వచ్చాడు.  ఇంగ్లాండ్ జట్టులో లేకపోయినా వాగాడియా గ్రౌండ్ లో ఎలా ఫీల్డింగ్ చేస్తాడని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే  లీడ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం జవాద్ అక్తర్, నోహ్ కెల్లీతో పాటు వగాడియాను 12వ వ్యక్తిగా ఎంపిక చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన కొద్దిసేపటికే స్టోక్స్ తిరిగి మైదానంలోకి వచ్చాడు. సాయి సుదర్శన్ వికెట్ తీసి ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు.

►ALSO READ | Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. కొత్త భద్రతా ప్రోటోకాల్‌లను ప్రకటించిన బీసీసీఐ

భారత సంతతికి చెందిన వగాడియా.. యార్క్‌షైర్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. మీడియం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గత సంవత్సరం వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి డొమెస్టిక్ వన్డేతో పాటు రెండు లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 23.5 ఓవర్లలో 90/2 స్కోరు చేసింది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (47 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 96 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. 

మూడో రోజు 209/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 100.4 ఓవర్లలో 465 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఫలితంగా ఇండియాకు ఆరు రన్స్​ స్వల్ప ఆధిక్యం లభించింది. ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (137 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఫోర్లతో 106) సెంచరీకి తోడు హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (99), జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌ (40) రాణించారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.