బోండా ఉమ,బుద్ధా వెంకన్న కారుపై YCP కార్యకర్తల దాడి

బోండా ఉమ,బుద్ధా వెంకన్న కారుపై YCP కార్యకర్తల దాడి

TDP నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై YCP కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. YCP కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
TDP అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా YCP కార్యకర్తలు అడ్డుకుంటోందనే వార్తలతో… విషయం తెలుసుకునేందుకు వీరిద్దరూ మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంలో వారిపై దాడి జరిగింది. పెద్ద కర్రతో ఓ వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.