
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా డే 24 గంటల కౌంట్ డౌన్ ఈవెంట్ ను నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
నగరం నలుమూలల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాదీలు తరలివచ్చారు. జూన్ 21న కేంద్ర గనులు, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఈవెంట్ లో యోగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం (జూన్ 21) ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు.
#WATCH | Hyderabad, Telangana | Union Minister G Kishan Reddy, Telangana Governor Jishnu Dev Varma, and Former Vice President M Venkaiah Naidu practice Yoga at Lal Bahadur Stadium, Hyderabad, during a 24-hour countdown event organised by the Ministry of Steel, Ministry of Coal… pic.twitter.com/Twp41jx2v8
— ANI (@ANI) June 20, 2025