ఐసోలేషన్ లో యూపీ సీఎం యోగి

ఐసోలేషన్ లో యూపీ సీఎం యోగి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులకు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా యోగి ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై యోగి ఓ ట్వీట్ చేశారు. 'నా కార్యాలయంలోని కొందరికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో కొందరు నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. దీంతో నేను హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వర్చువల్ గా పని చేస్తున్నా' అని యోగి పేర్కొన్నారు.