యోగిని చంపుతా.. ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్

యోగిని చంపుతా.. ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మరోసారి  హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్  డయల్ 112 కు మెసేజ్ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్  వచ్చింది, అందులో తాను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. 

యోగి  బెదిరింపు కాల్ రావడంతో 112 ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 506, 507, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెపట్టారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని రిహాన్ గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీలో  తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్ కౌంటర్లు, హత్యల క్రమంలో  ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్  రావడంతో యూపీ యాంటి టెర్రర్ స్వ్కాడ్ అప్రత్తమైంది.   సీఎం యోగికి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. 

అటు కేరళ పర్యటనకు ముందు ప్రధాని మోడీకి కూడా బెదిరింపు కాల్ వచ్చింది. మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ వచ్చింది.