వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న యోగీ ఆదిత్యనాథ్

వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న యోగీ ఆదిత్యనాథ్

వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు చెప్పారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. వ్యాక్సిన్ తయారీకి కృషి చేసిన శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. లక్నోలోని సివిల్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు యోగీ ఆదిత్యనాథ్. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందన్నారు.