
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలోని రెండు డిస్కమ్ల కరెంటు బిల్లులను గూగుల్పే ద్వారా చెల్లించవచ్చని సంస్థ ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ పే రాష్ట్ర యాజమాన్యంలోని రెండు విద్యుత్ బిల్లర్లు- నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదర్చుకుంది.
డీటీహెచ్, ఇంటర్నెట్, గ్యాస్, ఫాస్టాగ్, రీచార్జ్, విద్యుత్ సహా వివిధ విభాగాలలో బిల్లులు చెల్లించేందుకు ఎక్కువ మంది వినియోగదారులు తమ యాప్ను ఎంచుకుంటున్నారని గూగుల్పే తెలిపింది.