ఆర్బీఐ 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. దీంతో ఇవాళ్టి ( మే 23) నుంచి నుండి 2 వేల నోట్లను మార్చు కోవడానికి బ్యాంకులకు అనుమతిచ్చింది ఆర్బీఐ. కౌంటర్లో 2 వేల నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సాధారణ పద్ధతిలో ఏర్పాట్లు చేసింది. రోజుకు 2 వేల నోట్లను 20 వేల వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంకుతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో సెప్టెంబర్ 30 వరకు డిపాజిట్లు, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా బ్యాంకుల ముందు 2 వేల నోట్లను మార్చుకునేందుకు జనం క్యూ కట్టారు.
బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
- వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులో షేడెడ్ వెయిటింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది.
- డ్రింకింగ్ వాటర్ సదుపాయం మొదలైన శాఖల వద్ద తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి
- బ్యాంక్లు 2 వేల నోట్ల డిపాజిట్ , మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను నిర్వహించాలి.
- బ్యాంకులు డిపాజిటర్స్ రిసిప్ట్ ఇవ్వాలి
- బ్యాంకులు 2 వేల నోట్ల మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను అందించేలా ఒక ప్రొఫార్మా ను అందించింది ఆర్బీఐ.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19 శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్లో ఉంచొద్దని బ్యాంక్లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది