
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే కరోనా టెస్టు చేయించుకోవాలె
కామారెడ్డి , వెలుగు: అక్టోబర్ 9న జరిగే నిజామాబాద్లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కరోనా టెస్టులు చేయించుకోవాలి. ఇందుకనుగుణంగా ఆఫీసర్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలింగ్కు రెండు, మూడు రోజుల ముందు వరకు ఓటర్లకు టెస్టులు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో మెంబర్లు మొత్తం 824 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అన్నీ కరోనా రూల్స్ప్రకారమే..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తం కరోనా రూల్స్ కు అనుగుణంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ఆదేశించింది. ప్రచారం సందర్భంగా అభ్యర్థులు మాస్క్ వేసుకోవాలి. తప్పనిసరిగా ఫిజికల్డిస్టెన్స్పాటించాలి. మీటింగ్లు కూడా కరోనా రూల్స్ప్రకారమే పెట్టుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి. రెండు జిల్లాలో 20వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులకు కరోనా టెస్టులు జిల్లా, ఏరియా, సీహెచ్ సీ హాస్పిటళ్లతో పాటు, పీహెచ్సీలలో చేయనున్నారు. పోలింగ్కు వారం రోజుల ముందు నుంచి ఎప్పుడైనా టెస్టు చేయించుకోవచ్చు. పోలింగ్సెంటర్లోకి వెళ్లేముందు కచ్చితంగా రిపోర్టు చూపించాల్సి ఉంది. టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్పెషల్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారు పోస్టల్బ్యాలెట్లేదా పీపీఈ కిట్, గ్లౌస్ధరించి పోలింగ్ప్రక్రియ ముగిసే గంట ముందు కేంద్రానికి వెళ్లి ఓటేయవచ్చు.
For More News..