గండిపేట్, వెలుగు: మతిస్థిమితం లేని ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కి హల్చల్చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి అతడిని సముదాయించి కిందికి దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని పహడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మెహమూద్(26)కు కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా లేదు.
గురువారం మధ్యాహ్నం అతడు పీడీపీ చౌరస్తా ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి హైటెన్షన్ విద్యుత్ టవర్పైకి ఎక్కి కూర్చొని అరుస్తూ హల్చల్ చేశాడు. మెయిన్రోడ్ కావడంతో అటుగా వెళ్తున్న వాహనాదారులు, పాదచారులు విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలియజేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మెహమూద్ను కిందకు దింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంట పాటు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.