నడుముకు రాయి కట్టి.. గోనె సంచిలో కుక్కి చెరువులో పడేసిన్రు

నడుముకు రాయి కట్టి.. గోనె సంచిలో కుక్కి చెరువులో పడేసిన్రు
  • రంగారెడ్డి జిల్లా షాబాద్​లో యువకుడి దారుణ హత్య

చేవెళ్ల, వెలుగు: యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం షాబాద్ మండలంలోని హైతాబాద్ చెరువులో  గోనె సంచి తేలుతూ ఉండటాన్ని చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు గోనె సంచిని చెరువులో నుంచి బయటికి తీసుకొచ్చారు. దాన్ని తెరిచి చూడగా.. ఓ యువకుడి డెడ్ బాడీ కనిపించింది. చనిపోయిన వ్యక్తి మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన కమ్మరి ప్రవీణ్(31)గా పోలీసులు గుర్తించారు. యువకుడిని హత్య చేసి.. చేతులు వెనక్కి కట్టడంతో పాటు నడుముకు రాయిని కట్టేసి గోనె సంచిలో కుక్కి చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.