రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ యువతి ఒంటిపై పలు చోట్ల రక్త స్రావం ఉండటంతో ఆమె మృతి పట్ల బంధువులు, గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సిన్ ఆఫ్ ఎఫెన్స్ నుండి క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. భార్గవిని కుటుంబ సభ్యులే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఓ..యువకుడితో భార్గవి ప్రేమలో ఉండటం నచ్చని తండ్రి, సోదరుడు పలుమార్లు ఆమెను హెచ్చారించారని.. అయినప్పటికీ యువతి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతునట్లు చెబుతున్నారు. ఈక్రమంలో భార్గవిని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మాకు ఏమీ తెలిదంట్టున్నారు.