‘శరీరం ఛిద్రమయ్యేదాకా బుల్లెట్లు దింపుతా’.. గుండెలపై తుపాకీ పెట్టి యువతి బెదిరింపులు

‘శరీరం ఛిద్రమయ్యేదాకా బుల్లెట్లు దింపుతా’.. గుండెలపై తుపాకీ పెట్టి యువతి బెదిరింపులు

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని హర్దోయ్‎లో ఓ సీఎన్జీ వర్కర్‎పై యువతి రెచ్చిపోయింది. అతడి గుండెల మీద రివాల్వర్ పెట్టి కాల్చి చంపుతానని బెదిరించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. హర్దోయ్‎కు చెందిన ఎహ్​సాన్​ఖాన్ తన కుటుంబంతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. వెహికల్‎లో ఫ్యూయెల్ నింపుకునేందుకు ఓ సీఎన్జీ స్టేషన్‎కు వెళ్లాడు. 

అయితే, రీఫ్యూయెలింగ్ సమయంలో వాహనంలో ఉండడం సేఫ్ కాదని సీఎన్జీ బంక్ వర్కర్ రజనీశ్ కుమార్ చెప్పాడు. కారులో ఉన్న ఫ్యామిలీని కిందకు దిగాలని సూచించాడు. దీంతో ఎహ్​సాన్​ఖాన్  బయటకు వచ్చి రజనీశ్​తో వాదనకు దిగాడు. మాటామాటా పెరగడంతో రజనీశ్‎ను ఎహ్ సాన్ తోసేయగా.. రజనీశ్ కూడా ఎహ్​సాన్‎ను తోసేశాడు. ఇది చూసి ఎహ్​సాన్  కూతురు ఆరిబా తీవ్ర ఆగ్రహానికి గురైంది.

కారులో నుంచి రివాల్వర్ తీసుకుని రజనీశ్‎పై బెదిరింపులకు దిగింది. రజనీశ్ గుండెలపై తుపాకీ పెట్టి.. ‘‘నీ శరీరం మొత్తం ఛిద్రమయ్యేదాకా బుల్లెట్లు దింపుతా’’ అని వార్నింగ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఆరిబా తల్లి కల్పించుకుని కూతురును లాక్కెళ్లింది. ఈ ఘటన అంతా బంక్‎లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుడు రజనీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎహ్​సాన్  కుటుంబంపై కేసు నమోదు చేశారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్‎ను స్వాధీనం చేసుకున్నారు.