మద్యం మత్తులో యువకుల వీరంగం

మద్యం మత్తులో యువకుల వీరంగం

హైదరాబాద్ కొండాపూర్ లోని మసీద్ బండలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తుల్లో BMW కారు డ్రైవింగ్ చేసిన యువకులు బైక్ ను ఢీకొట్టారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారుపై ఎంపీ స్టిక్కర్ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. అయితే.. ప్రమాదం తర్వాత కారును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కారుపై ఉన్న స్టిక్కర్ మాయమైంది. మొదట స్టిక్కర్ పై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పిన పోలీసులు.. తర్వాత దాన్ని మాయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కారు నడిపిన లోహిత్ అనే యువకుడికి ఆల్కహాల్ 234 పాయిట్లు, పక్కనే కూర్చున్న లోహిత్ రెడ్డి అనే యువకుడికి ఆల్కహాల్ 501 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. విపరీతంగా మద్యం మత్తులో ఉన్న యువకులు, స్థానికులతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

మరిన్ని వార్తల కోసం

CSK కొంపముంచిన పవర్ కట్

అమ్మ పైలట్​.. కొడుకు కో-పైలట్​