అమ్మ పైలట్​.. కొడుకు కో-పైలట్​

అమ్మ పైలట్​.. కొడుకు కో-పైలట్​

పిల్లలు తమ అడుగుజాడల్లో నడిస్తే ఎంతో మురిసిపోతారు తల్లిదండ్రులు. ఈ పైలట్ అయిన తల్లి కూడా ఇప్పుడు అంతే సంతోషంగా ఉంది. కొడుకు  అమర్​ ఠాకూర్​ పైలట్ అవ్వడమే కాకుండా మొదటిసారిగా తను నడుపుతున్న ఫ్లయిట్​లో ఆమెను ప్యాసింజర్​గా తీసుకెళ్లాడు. మదర్స్ డే రోజున ఇండిగో ఫ్లయిట్​లో కనిపించిందీ దృశ్యం. ఈ తల్లీకొడుకుల  వీడియో ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది. పైలట్ అయిన తల్లిని చూసి, తను కూడా పైలట్ అవ్వాలి అనుకున్నాడు అమర్. అనుకున్నట్టుగానే ఇప్పుడు కో–పైలట్ అయ్యాడు. మదర్స్ డే రోజు తన విమానంలో కనిపించిన తల్లికి పూల బొకే ఇచ్చి సర్​ప్రైజ్ చేశాడు. 
 

ఈ రోజు నాకు చాలా స్పెషల్​
అంతేకాదు మైక్రోఫోన్ అందుకుని ‘‘గుడ్​ ఈవెనింగ్ లేడిస్ అండ్ జెంటిల్​మెన్, బాయ్స్​ అండ్ గర్ల్స్. నేను పైలట్ అమర్ ఠాకూర్. మీకో విషయం చెప్పాలి. ఈరోజు మదర్స్ డే. మీరందరూ మీ తల్లులకు విషెస్ చెప్పే ఉంటారు. నేను కూడా మా అమ్మకు నా ప్రేమను తెలియజేయాలి అనుకుంటున్నా. 25 ఏండ్లుగా మా అమ్మ ఫ్లయిట్ నడుపుతుంటే నేను ప్యాసింజర్​గా ఉన్నాను. 
కానీ, ఈ రోజు కో–పైలట్​గా నేను నడుపుతున్న ఫ్లయిట్​లో మా అమ్మ ప్రయాణిస్తోంది. నాకోసం అన్ని చేసినందుకు, అన్నివేళలా అండగా నిలిచినందుకు థ్యాంక్యూ సో మచ్ అమ్మా’’ అంటూ ఈ రోజు తనకెంత స్పెషల్​ అనేది  చెప్పాడు అమర్. ఇండిగో ఎయిర్​లైన్ వీళ్ల వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియోను ఇప్పటికే 70 లక్షల మంది చూశారు.