జాబ్ లేదనే డిప్రెషన్​తో యువకుడు సూసైడ్

జాబ్ లేదనే డిప్రెషన్​తో యువకుడు సూసైడ్

చందానగర్​, వెలుగు : జాబ్ లేదనే డిప్రెషన్​తో  ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.  చందానగర్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. పాపిరెడ్డికాలనీలో కె. నాగరాణి తన తల్లి, సోదరుడు సతీశ్(24)తో కలిసి నివసిస్తుంది. శుక్రవారం నాగరాణి డ్యూటీకి వెళ్లి తిరిగి సాయంత్రం 7.20 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటి మెయిన్​డోర్​ లోపలి నుంచి లాక్​చేసి ఉంది. డోర్​ కొట్టినా ఎవరు తీయకపోగా కిటికిలోంచి లోపలికి చూడగా సతీశ్​ ఉరేసుకుని కనిపించాడు.

స్థానికులతో కలిసి వెంటనే డోర్​ను పగులగొట్టి లోపలికి వెళ్లి సతీశ్​ను కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయాడు. పోలీసులకు సమాచారం అందించగా, వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. సతీశ్ డెలివరీ బాయ్​గా జాబ్ మానేసి నెల రోజులుగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నట్టు తెలిసింది. దీంతో డిప్రెషన్​లోకి వెళ్లి సూసైడ్ కు పాల్పడి ఉండొచ్చని కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.