చందానగర్, వెలుగు : జాబ్ లేదనే డిప్రెషన్తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. చందానగర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పాపిరెడ్డికాలనీలో కె. నాగరాణి తన తల్లి, సోదరుడు సతీశ్(24)తో కలిసి నివసిస్తుంది. శుక్రవారం నాగరాణి డ్యూటీకి వెళ్లి తిరిగి సాయంత్రం 7.20 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటి మెయిన్డోర్ లోపలి నుంచి లాక్చేసి ఉంది. డోర్ కొట్టినా ఎవరు తీయకపోగా కిటికిలోంచి లోపలికి చూడగా సతీశ్ ఉరేసుకుని కనిపించాడు.
స్థానికులతో కలిసి వెంటనే డోర్ను పగులగొట్టి లోపలికి వెళ్లి సతీశ్ను కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయాడు. పోలీసులకు సమాచారం అందించగా, వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. సతీశ్ డెలివరీ బాయ్గా జాబ్ మానేసి నెల రోజులుగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నట్టు తెలిసింది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ కు పాల్పడి ఉండొచ్చని కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.