ఖైరతాబాద్, వెలుగు: ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కంప్లయింట్ బాక్స్ను ఏర్పాటు చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పిలుపునిచ్చింది. గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, సంస్థ ఫౌండర్ రాజేంద్ర ఈ ఫిర్యాదుల బాక్స్ ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆఫీసుల్లో జనాలు ఎదుర్కొనే సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేలా కంప్లయింట్ బాక్స్లను ఏర్పాటు చేయాలన్నారు.
వారానికి ఒకసారి బాక్స్ను ఓపెన్చేసి అందులో వచ్చే సమస్యలు, కంప్లయింట్లు, అధికారుల మంచితనాన్ని బహిర్గతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారు ప్రతిభాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
