
బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండలం దామరంచ శివారులోని ఎండిన చెరువులో యువకులు ఆటలు ఆడుతున్నారు. గ్రామంలోని స్కూల్ ఆవరణలో ఆర్భాటంగా క్రీడా ప్రాంగణం ప్రారంభించినా క్రీడా సామగ్రి, కనీస వసతులు కల్పించలేదు. దీంతో యువకులు, స్టూడెంట్లకు అనువైన క్రీడా ప్రాంగణాలు లేక ఎండిన చెరువు స్థలాల్లో ఆటలు ఆడే పరిస్థితి నెలకొన్నది. బాన్సువాడ డివిజన్లోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని క్రీడాకారులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.