NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్.. పాక్ టూర్ వివరాలపై ఆరా

NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్.. పాక్ టూర్ వివరాలపై ఆరా

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పాకిస్తాన్ కు బైక్ పై వెళ్లటంపై సన్నీ యాదవ్ ను విచారించనున్నారు. ఇవాళ (గురువారం మే 29) చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు NIA అధికారులు.

భయ్యా సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ టూర్ వెళ్లాడు. బైక్ పై పాకిస్తాన్ కు వెళ్లి వచ్చిన భయ్యా నుంచి టూర్ కు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. ఇటీవల భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. భయ్యాను అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ALSO READ | ప్రధాని మౌనం వీడాలి..భారత్​, పాక్ ​మధ్య సీజ్​ఫైర్​పై అమెరికా వాదనపై స్పందించాలి: కాంగ్రెస్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కు వెళ్లే వారిపై నిఘా పెంచారు అధికారులు. అంతే కాకుండా పాక్ అధికారులతో, పౌరులతో సంబంధాలు పెట్టుకున్న వారిని గత కొద్ది రోజులుగా విచారిస్తున్నారు. పాక్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. కీలక ఆధారాలు చేరావేశారనే అనుమానంతో ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్నారు అధికారులు. 

లేటెస్ట్ గా భయ్యా సన్నీ యాదవ్ పాక్ కు వెళ్లి రావడంపై కూడా విచారించనున్నారు. ఒక టూరిస్ట్ లా వెళ్లి వచ్చాడా లేదా అంతర్గత, భద్రతకు సంబంధించిన వ్యవహారాలపై ప్రభావం చూపేలా ఏవైనా కార్యకలాపాలకు పాల్పడినాడా అనే కోణంలో భయ్యా సన్నీయాదవ్ ను విచారించనున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.