ప్రధాని మౌనం వీడాలి..భారత్​, పాక్ ​మధ్య సీజ్​ఫైర్​పై అమెరికా వాదనపై స్పందించాలి: కాంగ్రెస్

ప్రధాని మౌనం వీడాలి..భారత్​, పాక్ ​మధ్య సీజ్​ఫైర్​పై అమెరికా వాదనపై స్పందించాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: భారత్, -పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న వాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్​ చేసింది.  అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఈ నెల 23న న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో ‘‘అధ్యక్షుడు ట్రంప్ తన సుంకాల అధికారాన్ని ఉపయోగించి భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు’’అని చేసిన ప్రకటన నిజమా? కాదా? అనే విషయాన్ని ప్రధానమంత్రి దేశానికి తెలియజేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్​డిమాండ్​ చేశారు. 

ఈ మేరకు జైరాం రమేశ్ బుధవారం ఎక్స్​లో పోస్ట్​చేశారు. "భారత్, -పాకిస్తాన్ సీజ్‌‌‌‌‌‌‌‌ఫైర్ రెండు దేశాల సైనిక అధికారుల (డీజీఎంఓ) మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ఫలితం. ఇందులో అమెరికా సహా మూడో పక్షం పాత్ర లేదని స్పష్టంగా తెలుసు. ట్రంప్ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంటుంటే ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? దేశం సమాధానం కోరుతోంది" అని పేర్కొన్నారు. "మిస్టర్ లుట్నిక్ 3 దేశాల పర్యటనలో 11 రోజుల్లో ఎనిమిదిసార్లు ఈ ప్రకటన చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఇదే విషయం వెల్లడించారు. ఇప్పటికైనా "ప్రధాని చుప్పీ తోడో (ప్రధానమంత్రి.. మీ మౌనాన్ని వీడండి ) అని జైరాం రమేశ్​డిమాండ్​చేశారు.