
సత్తెనపల్లి లో హై టెన్షన్ వాతారవరణం నెలకొంది. వైసీపీ అధినేత జగన్ ఈరోజు ( జూన్ 18) సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులకు.. మున్సిపల్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు, 100 మంది వ్యక్తులకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. పోలీసుల ఆంక్షల మధ్య జగన్ సత్తెనపల్లిలో పర్యటించారు. .
జగన్ వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.శాంతి భద్రత కారణాలతో పల్నాడు జిల్లాలో పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నిఘాలో రెంటపాళ్ల ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లేదారిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.