కేసీఆర్.. ఎందుకీ రాజకీయ డ్రామాలు?

కేసీఆర్.. ఎందుకీ రాజకీయ డ్రామాలు?

హైదరాబాద్: ఉచిత ఎరువులు ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పెట్టుబడి రాక రైతులు చస్తుంటే సంబరాలు చేసుకుంటున్నారా అని దుయ్యబట్టారు. ‘ఎరువుల ధరలు పెరిగాయని, రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటే నమ్మాలా? మొన్నటివరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారని చెప్పిన వాళ్ల మెడలు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు’ అని షర్మిల క్వశ్చన్ చేశారు. అధికారం కోసం, కుర్చీ కోసం కేసీఆర్ ఆడుతున్న నాటకాల్లో ఇదీ ఒక భాగమే తప్ప.. రైతుల మీద ఆయనకు ప్రేమ లేదన్నారు. అన్నదాతల చావుల మీద సీఎంకు సోయి లేదని షర్మిల ట్వీట్ చేశారు.  

మరిన్ని వార్తల కోసం: 

పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

74 ఏండ్ల తర్వాత.. అన్నదమ్ములను కలిపిన కారిడార్

పుష్పరాజ్ గెటప్లో అదరగొడుతున్న భారత క్రికెటర్