న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల విలీనం చేశారు. జనవరి 4వ తేదీ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ సందరన్భంగా ఆమెకు రాహుల్, ఖర్గే లు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
YS Sharmila joined the Congress party.
— Congress for Telangana (@Congress4TS) January 4, 2024
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ#Sharmila #YSSharmila @realyssharmila pic.twitter.com/eG6IgfRMAM
.
అంతకుముందు ఈ రోజు ఉదయం ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో షర్మిల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన కుమారుడి పెండ్లి పత్రికను నేతలకు అందజేసి.. వివాహానికి హాజరవ్వాల్సిందిగా షర్మిల కోరినట్లు తెలుస్తోంది.