సీఎం గారూ.. వరంగల్ టూర్ ఎందుకు రద్దయింది? 

సీఎం గారూ.. వరంగల్ టూర్ ఎందుకు రద్దయింది? 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దవడంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న.. అడ్డుకుంటారని భయపడుతున్నారా అని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. ‘రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా?  లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు?’ అని షర్మిల క్వశ్చన్ చేశారు. 

పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతున్నారని షర్మిల ట్వీట్ చేశారు. కానీ నష్టపోయిన రైతును ఆదుకోడానికి, ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా అని కేసీఆర్ పై మండిపడ్డారు. కష్టకాలంలో అన్నదాతలకు భరోసా ఇవ్వలేని, చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని పేర్కొన్నారు. కాగా, వరంగల్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తన విజిట్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం:

ఈ వారం ఓటీటీలో అఖండ, శ్యామ్ సింగరాయ్

ఛత్తీస్గఢ్ బార్డర్లో కాల్పులు.. ఇద్దరు మావోలు మృతి

నేనేం ప్లాస్టిక్‌‌ బొమ్మను కాదు