నిరుద్యోగుల పక్షాన మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం

నిరుద్యోగుల పక్షాన మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం

పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయమని ఆమె అన్నారు. పార్టీ పెట్టకముందే తాము నిరుద్యోగుల కోసం 3 రోజుల పాటు, పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు నిరాహారదీక్షలు చేశామని ఆమె తెలిపారు. తమ పోరాటం వల్లే ప్రతిపక్షాలకు సోయి.. అధికారపక్షానికి బుద్ధి వచ్చిందని ఆమె అన్నారు. అబద్ధాలు చెప్పే అలవాటున్న కేసీఆర్.. మళ్లీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే.. కేవలం 80 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్.. అవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు.. ఖాళీలు భర్తీ చేసేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని షర్మిల తెలిపారు.